Share News

చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి : కలెక్టర్‌

ABN , Publish Date - Jun 18 , 2025 | 12:32 AM

ఐదు సంవత్సరాలు దాటిన పిల్లల ఆధార్‌ బయోవెట్రిక్‌ అప్‌డేట్‌ తప్పని జరిగా చేయించాలని కలెక్టర్‌ రాజకుమారి సూచించారు.

చిన్నారులకు ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి : కలెక్టర్‌
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లె, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఐదు సంవత్సరాలు దాటిన పిల్లల ఆధార్‌ బయోవెట్రిక్‌ అప్‌డేట్‌ తప్పని జరిగా చేయించాలని కలెక్టర్‌ రాజకుమారి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ల్‌లో జిల్లా స్థాయి ఆధార్‌ మోనిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఇంటర్‌ విద్యార్థులు పోటీ పరీక్షలు రాసే అవకాశం ఉండడంతో తప్పనిసరిగా ఆధార్‌ బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ చేసుకునేలా వారికి అవగాహన కల్పించాలని డీఈవో జనార్దన్‌రెడ్డిని ఆదేశించారు. జిల్లాలో ఆధార్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడానికి అవసరమైన శిక్షణలో ఎస్వీఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీఎల్‌డీవో శివారెడ్డి, జీఎ్‌సడబ్ల్యూఎస్‌ సమన్వయకర్త ఖాదర్‌, ఆధార్‌ రీజనల్‌ కార్యాలయ సిబ్బంది దామోదర్‌, ఐసీడీఎస్‌ పీడీ లీలావతి, డీఎంహెచ్‌వో వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 12:32 AM