17 రోజులుగా వాకర్స్ శాంతియుత నిరసన
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:36 AM
ఆంధ్రా లయోలా కళాశాల గ్రౌండ్లో వాకింగ్కు అనుమతిని కోరుతూ లయోలా వాకర్స్ చేస్తున్న నిరసన శుక్రవారానికి 17వ రోజుకు చేరింది

17 రోజులుగా వాకర్స్
శాంతియుత నిరసన
భారతీనగర్, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా లయోలా కళాశాల గ్రౌండ్లో వాకింగ్కు అనుమతిని కోరుతూ లయోలా వాకర్స్ చేస్తున్న నిరసన శుక్రవారానికి 17వ రోజుకు చేరింది. జిల్లా కలెక్టర్ లక్షీశ, నగర పొలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు సమక్షంలో వాకర్స్ ప్రతినిధులకు, కళాశాల యాజమాన్యంతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వాకర్స్ను గ్రౌండ్లోనికి వాకింగ్కు అనుమతి ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకునేలా ఆలోచించాలని కలెక్టర్ లక్షీశ యాజమాన్యాన్ని ఆదేశించారని వాకర్స్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ సంఘం ప్రతినిఽధులు గూడపాటి లక్ష్మీనారాయణ, తులసీ మోహన్, రావి రమేష్, వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు.