Share News

దేవాంగులకు ఎమ్మెల్సీ ఇవ్వాలి

ABN , Publish Date - Mar 06 , 2025 | 12:41 AM

రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేవాంగులకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలని కూటమిని దేవాంగ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శి పడవల మోహన త్రినాథ్‌ కోరారు.

దేవాంగులకు ఎమ్మెల్సీ ఇవ్వాలి

కూటమికి సంఘ రాష్ట్ర కార్యదర్శి పడవల మోహన త్రినాథ్‌ విజ్ఞప్తి

గూడూరు, మార్చి 5(ఆంధ్రజ్యోతి): రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేవాంగులకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలని కూటమిని దేవాంగ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శి పడవల మోహన త్రినాథ్‌ కోరారు. బుధవారం గూడూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితు ల్లో రాష్ట్రంలోని దేవాంగులకు ఎలాంటి ప్రాధాన్యం లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం ఎమ్మెల్సీ ఇచ్చి దేవాంగుల అభ్యున్నతికి పాటుపడాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Updated Date - Mar 06 , 2025 | 12:41 AM