జలధీశ్వరస్వామి సేవలో అడ్వకేట్ జనరల్
ABN , Publish Date - Jan 18 , 2025 | 12:42 AM
ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, తన కుటుంబసభ్యులతో కలిసి బాలపార్వతీ సమేత జలధీశ్వరస్వామిని శుక్రవారం దర్శించుకున్నారు.

ఘంటసాల, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, తన కుటుంబసభ్యులతో కలిసి బాలపార్వతీ సమేత జలధీశ్వరస్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. స్వామికి ఆలయ అర్చకుడు మొవ్వ ఉమామహేశ్వరరావు విశేష పూజలు చేశారు. ప్రసాదాన్ని, దేవాలయ చిత్రపటాన్ని, చరిత్ర పుస్తకాలను దమ్మాలపాటికి అందజేశారు.