రోడ్లపై చెత్త వేస్తే చర్యలు
ABN , Publish Date - Feb 14 , 2025 | 01:15 AM
నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాళ్ల నిర్వాహకులు చె త్తను రో డ్లపై వే స్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు.

హోటళ్లు, టీ స్టాళ్ల నిర్వాహకులకు కలెక్టర్ బాలాజీ హెచ్చరిక
మచిలీపట్నం టౌన్: నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాళ్ల నిర్వాహకులు చె త్తను రో డ్లపై వే స్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. పారిశుధ్య పనుల క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా గురువారం ఉదయం నగరంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. మూ డు స్తంభాల సెంటర్ వద్ద టీస్టాల్ నిర్వాహకులు తాగేసిన కప్పులు, పేపర్ ప్లేట్లను రోడ్లపై వేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.