సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలి: ఎస్టీయూ
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:42 PM
రాష్ట్రంలో 117 జీఓ రద్దు అనంతరం క్లస్టర్ పాఠశాలల ఏర్పాటు, మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఎంపిక ద్వారా పాఠశాలల పునర్నిర్మాణ ప్రక్రియలో ఎ టువంటి సమస్యలు ఉత్ప న్నం కాకుండా ఆర్జేడీ శామ్యుల్ను ఎ స్టీయూ నాయకులు కోరారు.

కడప నాగరాజుపేట, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 117 జీఓ రద్దు అనంతరం క్లస్టర్ పాఠశాలల ఏర్పాటు, మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఎంపిక ద్వారా పాఠశాలల పునర్నిర్మాణ ప్రక్రియలో ఎ టువంటి సమస్యలు ఉత్ప న్నం కాకుండా ఆర్జేడీ శామ్యుల్ను ఎ స్టీయూ నాయకులు కోరారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ ఒక్క పాఠశాల కూడా మూతపడకుండా పాఠశాలల పునర్నిర్మాణ ప్రక్రియను పూర్తిచేయాలని కోరా రు. ఆర్జేడీ స్పందిస్తూ త్వరలో సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటుచేసి చర్చించి పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురే్షబాబు బాలగంగిరెడ్డి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇలియాస్ బాషా, సంగమేశ్వర్రెడ్డి, జిల్లానాయకులు చెన్నకేశవరెడ్డి, ప్రతా్పరెడ్డి, మస్తాన బాబు, చంద్రమోహనరెడ్డి, తులసీదర్, ధర్మారెడ్డి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
ఆర్జేడీకి సత్కారం
కడప ఎడ్యుకేషన, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్య ప్రాంతీయ సంచాలకులుగా పదోన్నతి పొంది విధుల్లో చేరిన కె.శామ్యుల్ను రాష్ట్ర ఉపాధ్యాయ పండిత పరిషత్తు కడప జిల్లా శాఖ వారు శుక్రవా రం శుభాకాంక్షలు తెలిపారు. ఆర్జేడీని సత్కరించారు. కడప జిల్లా పండిత పరిషత గౌరవాధ్యక్షుడు ఎ.నరసింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసురేష్, జిల్లా బాధ్యులు చిన్నబాబయ్య, బాలనరసింహులు, పెద్ద ఓబయ్య తదితరులు పాల్గొన్నారు.