Share News

నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి

ABN , Publish Date - Feb 08 , 2025 | 12:36 AM

కమ్యూనిటీ బేస్డ్‌ ఆర్గనైజేషన్సలో డ్వాక్రా లీడర్లు, గ్రామ సమా ఖ్య పదాధికారులు, మండల మహిళా స మాఖ్య పదాధికారు లు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని ఏపీ ఎం ఆంజనేయులు అన్నారు.

నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి
మాట్లాడుతున్న ఏపీఎం ఆంజనేయులు

వేముల, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): కమ్యూనిటీ బేస్డ్‌ ఆర్గనైజేషన్సలో డ్వాక్రా లీడర్లు, గ్రామ సమా ఖ్య పదాధికారులు, మండల మహిళా స మాఖ్య పదాధికారు లు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని ఏపీ ఎం ఆంజనేయులు అన్నారు. శుక్రవారం వేములలోని స్త్రీశక్తి భవనలో మండల మహిళా సమాఖ్య కార్యవర్గ సభ్యులకు, గ్రామ సమాఖ్య అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏపీఎం మాట్లాడుతూ డ్వాక్రా సభ్యుల అభివృద్ధికి సంక్షేమానికి కృషిచేసే మహిళా సభ్యులని లీడర్లుగా ఎంపిక చేసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటటీ కోఆర్డినేటర్లు జైపాల్‌, జ్యోతి, నాగేశ్వరి, గంగరాజు, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2025 | 12:36 AM