మల్లన్న సన్నిధిలో హైకోర్టు జడ్జి..
ABN , Publish Date - Jan 16 , 2025 | 05:31 AM
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను బుధవారం ఆంరఽధప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి దంపతులు

శ్రీశైలం, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను బుధవారం ఆంరఽధప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి దంపతులు దర్శించుకున్నారు. స్వామివారికి అభిషేకం నిర్వహించుకుని, భ్రమరాంబికాదేవి అమ్మవారికి పూజలు చేశారు. దర్శనానంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో న్యాయమూర్తికి వేదపండితులు వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు.