Share News

India 6G: 6జీతో ప్రపంచ లీడర్‌గా భారత్‌

ABN , Publish Date - May 15 , 2025 | 02:31 AM

భారత్‌ 6జీ సాంకేతికతలో ప్రపంచానికి నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉందని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. 6జీ నెట్‌వర్క్‌ 2028 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముందని, 2030 నాటికి వాణిజ్య పరంగా ప్రారంభమవుతుందని చెప్పారు.

India 6G: 6జీతో ప్రపంచ లీడర్‌గా భారత్‌

2028 నాటికి అందుబాటులోకి నెట్‌వర్క్‌: పెమ్మసాని

న్యూఢిల్లీ, మే 14(ఆంధ్రజ్యోతి): సమాచార సాంకేతిక విప్లవంలో భారత్‌ భాగస్వామిగానే కాకుండా, 6జీతో ప్రపంచానికి నాయకత్వం కూడా వహించడానికి సిద్ధంగా ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్రశేఖర్‌ చెప్పారు. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన ‘భారత్‌ 6జీ 2025’ మూడో అంతర్జాతీయ సదస్సు, ప్రదర్శన కార్యక్రమానికి పెమ్మసాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొదటి 6జీ నెట్‌వర్క్‌ 2028 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, వాణిజ్య పరంగా 2030 నాటికి 6జీ అమలయ్యే అవకాశం ఉందని పెమ్మసాని తెలిపారు. గ్లోబల్‌ 6జీ నాయకత్వం కోసం ఇప్పటికే ప్రపంచస్థాయిలో పోటీ ఏర్పడిందన్నారు. ప్రపంచంలోనే దేశంలో తక్కువ ధరలో 5జీ డేటా లభిస్తోందని వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్

Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్

Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 15 , 2025 | 02:32 AM