Pawan Kalyan : కాకినాడలో జాతీయ జెండా ఎగురవేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ABN , Publish Date - Aug 15 , 2025 | 10:37 AM
కాకినాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతీయ జెండా ఎగురవేసి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పనుల గురించి ప్రజలకు వివరించారు.
కాకినాడ, ఆగస్టు 15 : కాకినాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతీయ జెండా ఎగురవేసి వందనం సమర్పించారు. అంతకుముందు జరిగిన కవాతులో డిప్యూటీ సీఎం గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పనుల గురించి ప్రజలకు వివరించారు. రూ.7,900 కోట్లతో 5 జిల్లాల్లో జల్జీవన్ మిషన్ పనులు జరుగుతున్నాయని పవన్ చెప్పారు. 2024లో రూ.380 కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు.
సుస్థిర పాలన కోసమే 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం ఉండాలన్న పవన్.. పదవుల్లో ఉండి ఎంజాయ్ చేయాలనేది మా ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.
పులివెందుల జెడ్పీటీసీ ఫలితాలపై మాట్లాడిన పవన్.. వైసీపీ వాళ్లు.. గెలిస్తే ప్రజాతీర్పు అంటారు.. కూటమి గెలిస్తే EVMల తప్పా? అంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాటల్ని ఎద్దేవా చేశారు.
