జీవవైవిధ్యాన్ని పరిరక్షించాలి: నీలాయపాలెం
ABN , Publish Date - Feb 19 , 2025 | 04:47 AM
మానవాళి భవిష్యత్ కోసం జీవ వైవిఽధ్యాన్ని పరిరక్షించాలని రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్కుమార్ అన్నారు.
అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): మానవాళి భవిష్యత్ కోసం జీవ వైవిఽధ్యాన్ని పరిరక్షించాలని రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్కుమార్ అన్నారు. మంగళవారం రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు కార్యాలయంలో ఏపీ, తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డుల ఆధ్వర్యంలో పంచాయతీల్లో ఏర్పాటైన జీవ వైవిధ్య గ్రూపులకు, బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలకు మూడు రోజుల కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాంను పైలట్గా ప్రారంభించింది. ఈ సందర్భంగా విజయ్కుమార్ మాట్లాడుతూ జీవవైవిధ్య చట్టం-2002 పటిష్ఠంగా అమలుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.