Share News

వాడపల్లికి పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Jan 16 , 2025 | 01:01 AM

ఆత్రేయపురం, జనవరి 15(ఆంధ్రజ్యోతి): కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. సంక్రాం తి, కనుమ 2రోజులు వివిధ రాష్ర్టాల నుం

వాడపల్లికి పోటెత్తిన భక్తులు
వాడపల్లి వెంకన్న ఆలయంలో భక్తులు

ఆత్రేయపురం, జనవరి 15(ఆంధ్రజ్యోతి): కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. సంక్రాం తి, కనుమ 2రోజులు వివిధ రాష్ర్టాల నుంచి తరలివచ్చిన వేలాదిమంది స్వామిని దర్శించుకున్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ పుష్పాలంకరణ విశేషంగా ఆకట్టుకోగా ఫొటోషూట్ల వద్ద భక్తజన సందడి కనిపించింది. నోము ఆచరించిన భక్తులు అష్టోత్తర పూజలు, నిత్యకల్యాణాలు నిర్వహించుకున్నారు. స్వామిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. వివిధ సేవల ద్వారా ఆలయానికి 2 రోజుల్లో రూ.9 లక్షల 46 వేల 408 ఆదాయం లభించినట్టు ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.

Updated Date - Jan 16 , 2025 | 01:01 AM