వాడపల్లి వెంకన్న ఆదాయం రూ.1.71 లక్షలు
ABN , Publish Date - Mar 07 , 2025 | 01:30 AM
వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది.

ఆత్రేయపురం, మార్చి 6(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది. నోము ఆచరించిన భక్తులు అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణాలు జరిపారు. స్వామివారిని దర్శించుకున్న అనం తరం భక్తులు అన్న ప్రసాదంలో పాల్గొ న్నారు. వివిధ సేవల ద్వారా ఒకరోజు ఆదాయం రూ.1,7,359 వచ్చినట్టు ఉపకమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.