Share News

వాడపల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Jan 31 , 2025 | 12:41 AM

వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి గురువారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడింది.

వాడపల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు

ఆత్రేయపురం, జనవరి 30(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి గురువారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. నోము ఆచరించిన భక్తులు అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణాలు చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంత రం భక్తులు అన్న ప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా ఒకరోజు ఆదాయం రూ.2,11,922 వచ్చినట్టు ఉప కమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.

Updated Date - Jan 31 , 2025 | 12:41 AM