వెంకన్న ఆలయంలో భక్తుల కిటకిట
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:37 PM
వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడింది.

ఆత్రేయపురం, జనవరి 17(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నోము ఆచరించారు. ఈ సంద ర్భంగా పలువురు అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణాలు, ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు అన్నప్రసాదంలో పాల్గొన్నారు. వకుళమాత అన్నదాన భవన నిర్మాణానికి కామవరపుకోటకు చెందిన ప్రసాద్ కుటుంబ సభ్యులు రూ.54,018 విరాళం ఇచ్చారు. ఆలయ ప్రాంగ ణం భక్తుల గోవిందనామ స్మరణతో హోరెత్తిం ది. వివిధ సేవల ద్వారా ఒకరోజు ఆదాయం రూ.6,68,193 వచ్చినట్టు ఉపకమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.