వాడపల్లి ఆలయంలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Jan 17 , 2025 | 12:30 AM
వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది.

ఆత్రేయపురం, జనవరి 16(ఆంధ్రజ్యోతి): వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది. నోము ఆచరించిన భక్తజనం అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణాలు జరిపారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు అన్న ప్రసాదంలో పాల్గొ న్నారు. అన్నదాన భవన నిర్మాణానికి పెనుమంట్ర మండలం ఆలమూరుకు చెందిన పడాల సత్యనారాయణరెడ్డి కుటుంబ సభ్యులు రూ.1.16 లక్షల విరాళం ఇవ్వగా, దాతలకు స్వామివారి చిత్రపటం అందించారు. వివిధ సేవల ద్వారా ఒకరోజు ఆదాయం రూ. 6,17,372 వచ్చినట్టు ఉపకమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.