Share News

గోవింద నామస్మరణతో పులకించిన వాడపల్లి

ABN , Publish Date - Jan 07 , 2025 | 01:19 AM

వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం సోమ వారం గోవింద నామస్మరణతో పులకించింది

గోవింద నామస్మరణతో పులకించిన వాడపల్లి

ఆత్రేయపురం, జనవరి6 (ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం సోమ వారం గోవింద నామస్మరణతో పులకించింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. వేకువజామునే స్వామివారికి గోదావరి జలాలను తీర్థపు బిందెతో తీసుకువచ్చి స్నపన మూర్తులకు అభిషేకం చేశారు. అనంతరం తిరుప్పావై వేదపారాయణం జరిపారు. నోము ఆచరించిన భక్తులు అష్టోత్తర పూజలు, నిత్యకల్యాణాలు చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు అన్న ప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా ఒకరోజు ఆదాయం రూ.2,74,264 వచ్చిందని ఉపకమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.

Updated Date - Jan 07 , 2025 | 01:20 AM