సబ్ ట్రెజరీని తనిఖీ చేసిన డీటీఏవో
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:27 AM
రాయవరం సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా ట్రెజరీ అకౌంట్స్ ఆఫీసర్ (డీటీఏవో) బి.రామనాధం తనిఖీ చేశారు.

రాయవరం, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): రాయవరం సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా ట్రెజరీ అకౌంట్స్ ఆఫీసర్ (డీటీఏవో) బి.రామనాధం తనిఖీ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సబ్ ట్రెజరీ కార్యాలయంలోని రికార్డులను ఆయన తనిఖీ చేశా రు. సబ్ ట్రెజరీ పరిధిలో ఎంత మంది పెన్షనర్లు ఉన్నారు, వారంతా లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించారా అనే విషయంపై ఆరా తీశారు. అనంతరం టీడీఏవోను సిబ్బంది సత్కరించారు. కార్యక్రమంలో ఎన్టీవో ఎన్ఎస్ఎన్ మూర్తి, సీసీ కె.శివకుమార్, సిబ్బంది ఉన్నారు.