గోకులం షెడ్డును ప్రారంభించిన మంత్రి సుభాష్
ABN , Publish Date - Jan 12 , 2025 | 01:09 AM
రామచంద్రపురం మండలం ఏరుపల్లిలో ఉపాధి హామీ పథకంలో నిర్మించిన గోకులంషెడ్డును శనివారం మంత్రి సుభాష్ ప్రారంబించారు.

ద్రాక్షారామ, జనవరి 11(ఆంధ్రజ్యోతి): రామచంద్రపురం మండలం ఏరుపల్లిలో ఉపాధి హామీ పథకంలో నిర్మించిన గోకులంషెడ్డును శనివారం మంత్రి సుభాష్ ప్రారంబించారు. దీన్ని ప్రారంభించిన అనంతరం గోవులకు ఆయన పశుగ్రాసం వేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సాక్షిశివ, మాజీ సర్పంచ్ చిల్లా గోపాలకృష్ణ, టీడీపీ మండల అధ్యక్షుడు పితాని వీరభద్రరావు, ఎంపీడివో కడలి పద్మజ్యోతి, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో ఈశ్వర్, పశుసంవర్థకశాఖ ఏడి, పంచాయతీ విస్తరణ అభివృద్ధి అధికారి షెట్లర్ రాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు.