సర్వీసు ప్రొవైడర్లు ఉత్తమ సేవలందించాలి
ABN , Publish Date - Mar 07 , 2025 | 01:33 AM
మెప్మా ద్వారా శిక్షణ పొందిన సర్వీసు ప్రొవైడర్లు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మండపేట మున్సిపల్ కమీషనర్ టీవీ రంగారావు పిలుపునిచ్చారు.

మండపేట, మార్చి 6(ఆంధ్రజ్యోతి): మెప్మా ద్వారా శిక్షణ పొందిన సర్వీసు ప్రొవైడర్లు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మండపేట మున్సిపల్ కమీషనర్ టీవీ రంగారావు పిలుపునిచ్చారు. మండపేటలో గురువారం మెప్మా, లైఫ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణలో కమిషనర్ ముఖ్య అతిఽథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో మెప్మా సీసీఎం పి.సుజాత, సీవో మహాలక్ష్మి, సెంటర్ ఇన్చార్జి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.