Share News

శనేశ్వర ఆలయంలో భక్తుల పూజలు

ABN , Publish Date - Feb 02 , 2025 | 12:27 AM

మందపల్లి శనేశ్వర(మందేశ్వర) స్వామి ఆలయానికి శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

 శనేశ్వర ఆలయంలో భక్తుల పూజలు

కొత్తపేట, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): మందపల్లి శనేశ్వర(మందేశ్వర) స్వామి ఆలయానికి శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే స్వామివారి సర్వదర్శనాలు, తైలాభిషేకాలకు బారులు తీరారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. వివిధ సేవల ద్వారా స్వామివారికి రూ.1,49,886 ఒకరోజు ఆదా యం వచ్చినట్లు ఆలయ సహాయ కమీషనరు నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.

Updated Date - Feb 02 , 2025 | 12:27 AM