Share News

నూకాంబిక ఆలయానికి విరాళం

ABN , Publish Date - Mar 06 , 2025 | 01:02 AM

చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయానికి ఆలమూరుకు చెందిన పారిశ్రామికవేత్త వంటిపల్లి కాశీవిశ్వనాధం, కాశీఅన్నపూర్ణ దంపతులు రూ.లక్ష విరాళం ఇచ్చారు.

నూకాంబిక ఆలయానికి విరాళం

ఆలమూరు, మార్చి 5(ఆంధ్రజ్యోతి): చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయానికి ఆలమూరుకు చెందిన పారిశ్రామికవేత్త వంటిపల్లి కాశీవిశ్వనాధం, కాశీఅన్నపూర్ణ దంపతులు రూ.లక్ష విరాళం ఇచ్చారు. బుధవారం ఆలయ ఈవో వుండవల్లి వీర్రాజుచౌదరి, ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్లు వైట్ల శేషుబాబు, డి.రామకృష్ణ, ఆలమూరు పీఎసీఎస్‌ అధ్యక్షుడు వంటిపల్లి సతీష్‌కుమార్‌, గణేష్‌ సమక్షంలో వారు విరాళం అందించారు.

ఆలయ హుండీ లెక్కింపు: నూకాంబిక ఆలయ హుండీ లెక్కింపు బుధవారం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వుండవల్లి వీర్రాజుచౌదరి ఆధ్వర్యంలో జరిగిన హుండీ లెక్కింపులో పలువురు భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. హుండీ లెక్కింపులో రూ.5,17,473ల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో వీర్రాజు తెలిపారు.

Updated Date - Mar 06 , 2025 | 01:02 AM