ప్రభుత్వ పాఠశాలల్లో విద్య బలోపేతమే లక్ష్యం
ABN , Publish Date - Jan 22 , 2025 | 12:35 AM
రాజమహేంద్రవరం సిటీ, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా విద్యాశాఖ ముందుకు సాగుతుందని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు అన్నారు. రాజమహేంద్రవరం శ్రీవెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో మంగళవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని మానవ వనరుల అధికారులు, ప్రధానోపాధ్యాయులతో రాష్ట్రంలో నూతన విద్యావిధానంపై నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో ఆయన
ప్రతీ గ్రామంలో మోడల్ ప్రైమరీ పాఠశాల తప్పనిసరి
విద్యాశాఖ ప్రాంతీయ సదస్సులో డైరెక్టర్ విజయరామరాజు
రాజమహేంద్రవరం సిటీ, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా విద్యాశాఖ ముందుకు సాగుతుందని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు అన్నారు. రాజమహేంద్రవరం శ్రీవెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో మంగళవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని మానవ వనరుల అధికారులు, ప్రధానోపాధ్యాయులతో రాష్ట్రంలో నూతన విద్యావిధానంపై నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. పాఠశాలల్లో విద్యను బలోపేతం చేయడానికి మానవ వనరుల విభాగంలో భాగస్వామ్యం అయిన మేధావి వర్గంతో అవగాహనతో కూడిన శిక్షణ కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో 6,7,8 విద్యార్థులు ఉన్న చోట విద్యార్థుల సంఖ్యను బట్టి ఉన్నత పాఠశాలలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ గ్రామంలో మోడల్ ప్రైమ రీ పాఠశాల తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ ప్రక్రియ సజావుగా పూర్తి చేయడానికి జిల్లా పరిపాలన యంత్రాంగం ప్రమేయం చాలా అవసరమన్నారు. అందుకనుగుణంగా ఆయా సమన్వ య శాఖల అధికారులతో వర్క్షాపును ఏర్పా టు చేశామన్నారు. నూతన ప్రతిపాదిత విధానంలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా శాటిలైట్ ఫౌండేషన్, ఫౌండేషన్, మోడల్ ప్రైమరీ, బేసిక్ ప్రైమరీ, హైస్కూల్గా పాఠశాలల ఉన్నతీకరణ చేస్తామన్నారు. ఈ మేరకు జిల్లాలో క్లస్టర్లు ఏ ర్పాటు, ఒక్కో క్లస్టర్ పరిధిలో 15 నుంచి 25 పాఠశాలలు ఉండేలా చర్యలు తీసుకోవడం జ రుగుతుందన్నారు. వీటిలో చేపట్టాల్సిన మార్పులు చేర్పులపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. వారి అభిప్రాయాలను సమీకరించి ఒక సమగ్ర అధ్యయన నివేదిక రూపొందిస్తామని తెలిపారు.
ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డుల్లో మోడల్ ప్రాఽథమిక పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసేందుకు కమిటీలు ఏర్పాటు చే యాలన్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వ ర్యంలో నడుస్తున్న బాల్య సంరక్షణ, విద్యసజావుగా ఉండేలా ఉమ్మడి అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలతో అనుసంధానించడం గాని లేదా సమీపంలోని అంగన్వాడీ కేంద్రాలను మార్చడం ద్వారా ప్రాఽథమిక పాఠశాలను ఏ ర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆయ న సూచించారు. సమావేశంలో తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ కలెక్టర్లు పి.ప్రశాంతి, మహే ష్ రావిరాల, ఎస్.షాన్మోహన్, కమిషనర్ కేతన్ గార్గ్, పాఠశాల విద్యా ప్రాంతియ సంయుక్త డైరెక్టర్ జి.నాగమణి, ఆర్డీవోలు, డిప్యూటీ డీఈవోలు,ఎంఈవోలు, హెచ్ఎంలు పాల్గొన్నారు.