భీమేశ్వరస్వామి నిత్యాన్నదానానికి లక్ష విరాళం
ABN , Publish Date - Jan 17 , 2025 | 12:34 AM
ద్రాక్షారామ భీమేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు హైదరాబాద్కు చెందిన పుప్పాల అజయ్కుమార్ ఒక లక్షా 116 విరాళం అందించారు.

ద్రాక్షారామ, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ద్రాక్షారామ భీమేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు హైదరాబాద్కు చెందిన పుప్పాల అజయ్కుమార్ ఒక లక్షా 116 విరాళం అందించారు. గురువారం స్వామి వారి ఆలయంలో సీనియర్ సహాయకుడు సూరపురెడ్డి వెంకటేశ్వరరావుకు చెక్కును అందించారు. కార్యక్రమంలో సినీనటులు రాంజీజగన్, మురళీకృష్ణం రాజు, లయన్స్ క్లబ్ బంజారా సభ్యులు అజయ్కుమార్ పాల్గొన్నారు.