నేడు కలెక్టరేట్లో యథావిధిగా గ్రీవెన్స్
ABN , Publish Date - Jan 06 , 2025 | 12:24 AM
ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటల నుంచి కలెక్టరేట్లోని గోదావరి భవన్లో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
అమలాపురం, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటల నుంచి కలెక్టరేట్లోని గోదావరి భవన్లో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి పరిష్కార మార్గాలు పొందాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాస్థాయితో పాటు డివిజన్, మండలస్థాయిల్లో గ్రీవెన్స్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.