ర్యాలి అయ్యప్ప ఆలయంలో భక్తుల సందడి
ABN , Publish Date - Jan 16 , 2025 | 01:38 AM
ర్యాలి ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో మంగళవారం మకర సంక్రాంతిని పుర స్కరించుకుని మంగళవారం స్వామివారికి పంచామృతాభిషేకం చేశారు.

ఆత్రేయపురం, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): ర్యాలి ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో మంగళవారం మకర సంక్రాంతిని పుర స్కరించుకుని మంగళవారం స్వామివారికి పంచామృతాభిషేకం చేశారు. వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి అర్చన జరిపి అలం కరించారు. స్వామివారి గ్రామోత్సవం ఘనం గా జరిగింది. సాయంత్రం మకరజ్యోతి దర్శ నం నిర్వహించారు. ప్రధాన అర్చకుడు రఘు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేయగా, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.