Share News

ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా క్యాలెండర్‌ ఆవిష్కరించిన కలెక్టర్‌

ABN , Publish Date - Feb 06 , 2025 | 01:24 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) తూర్పుగోదావరి జిల్లా 2025 క్యాలెండర్‌ను కలెక్టర్‌ ప్రశాంతి ఆవిష్కరించారు.

ప్రభుత్వ ఉద్యోగుల సంఘం                            జిల్లా క్యాలెండర్‌ ఆవిష్కరించిన కలెక్టర్‌

రాజమహేంద్రవరం అర్బన్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) తూర్పుగోదావరి జిల్లా 2025 క్యాలెండర్‌ను కలెక్టర్‌ ప్రశాంతి ఆవిష్కరించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె క్యాలెండర్‌ ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడు పి.గిరిప్రసాద్‌వర్మ, జిల్లాకార్యదర్శి సీహెచ్‌ఎస్‌ విల్సన్‌పాల్‌, జిల్లా ఉపాధ్యక్షులు కాకర్ల వెంకటేశ్వరరావు, పి.రవికుమార్‌, రాజమహేంద్రవరం నగరశాఖ అధ్యక్షుడు విజయకుమార్‌, నాయకు లు ఏ శ్రీనివాసరావు, లక్ష్మీప్రసన్న, అగ్రికల్చర్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నేతలు హమీద్‌, మహ్మద్‌ ఖాజామొహిద్దీన్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2025 | 01:24 AM