కాకినాడలో సినీనటి అనుపమ పరమేశ్వరన్ సందడి
ABN , Publish Date - Aug 12 , 2025 | 01:49 AM
కార్పొరేషన్ (కాకినాడ), ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): కాకినాడలో సోమవారం సినీనటి అనుపమ పరమేశ్వరన్ సందడి చేశారు. పరదా చిత్రం ప్రచారం నిమిత్తం వచ్చిన ఆమె కాకినాడ నగరంలోని సుబ్బయ్య హోటల్లో భోజనం చేశారు. దీంతో ఆమెను చూసేందుకు పెద్దసంఖ్యలో అభిమానులు హోటల్కి తరలివచ్చారు
సుబ్బయ్య హోటల్లో భోజనం
కార్పొరేషన్ (కాకినాడ), ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): కాకినాడలో సోమవారం సినీనటి అనుపమ పరమేశ్వరన్ సందడి చేశారు. పరదా చిత్రం ప్రచారం నిమిత్తం వచ్చిన ఆమె కాకినాడ నగరంలోని సుబ్బయ్య హోటల్లో భోజనం చేశారు. దీంతో ఆమెను చూసేందుకు పెద్దసంఖ్యలో అభిమానులు హోటల్కి తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంత మంతా సందడిగా మారింది. ఈ సందర్భంగా సినీనటి అనుపమ మాట్లాడుతూ సుబ్బయ్య హోటల్ భోజనం అంటే తనకి ఎంతో ఇష్టమని, అందుకే ఇక్కడ భోజనం చేసేందుకు వచ్చానని తెలిపారు.