పరిసరాల పరిశుభ్రత పాటించాలి
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:53 AM
ప్రజలంతా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి తడి-పొడి చెత్తలను వేర్వేరుగా పారిశుధ్య కార్మికులకు అందించాలని జిల్లా పంచాయతీ అధికారిణి శాంతలక్ష్మి సూచించారు.

ముమ్మిడివరం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ప్రజలంతా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి తడి-పొడి చెత్తలను వేర్వేరుగా పారిశుధ్య కార్మికులకు అందించాలని జిల్లా పంచాయతీ అధికారిణి శాంతలక్ష్మి సూచించారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆదివారం అనాతవరంలో ఇంటింటీ వెళ్లి పంచాయతీ సిబ్బంది, క్లాప్ మిత్రులు తడి-పొడి చెత్తను సేకరించారు. కార్యక్రమాన్ని జిల్లా పంచాయతీ అధికారిణి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ప్రజలకు పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించి తడి-పొడి చెత్తను ఎలా వేరుచేసి అందించాలనే విషయంపై వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ కల్యాణి, పంచాయతీ కార్యదర్శి సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.