Share News

Mental Illness Awareness: మానసిక రుగ్మతలను ప్రాథమిక దశలోనే గుర్తించాలి

ABN , Publish Date - May 31 , 2025 | 04:58 AM

స్కిజోఫ్రెనియా మొదటి దశలో గుర్తిస్తే పూర్తిగా కోలుకోవచ్చు అని డాక్టర్‌ ప్రసాదరావు తెలిపారు. గుంటూరులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మానసిక రుగ్మతలపై నిపుణులు ముఖ్యమైన అంశాలు వివరించారు.

Mental Illness Awareness: మానసిక రుగ్మతలను ప్రాథమిక దశలోనే గుర్తించాలి

ఆషా ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ జీ ప్రసాదరావు

గుంటూరు (తూర్పు), మే 30 (ఆంధ్రజ్యోతి): మానసిక రుగ్మత (స్కిజోఫ్రెనియా)ను ప్రాథమిక దశలోనే గుర్తించగలిగితే బాధితులు వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవచ్చని హైదరాబాద్‌ ఆషా ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ జీ ప్రసాదరావు అభిప్రాయడ్డారు. ప్రపంచ స్కిజోఫ్రెనియా దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు మెడికల్‌ క్లబ్‌లో ‘‘మానసిక రుగ్మతలు-అందుబాటులో చికిత్స’’ అనే అంశంపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్కిజోఫ్రెనియా వ్యాధికి కారణమైన నూతన పరిశోధనలు, చికిత్స విధానాలను వివరించారు. వ్యాధి తీవ్రమైతే జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పారు. స్కిజోఫ్రెనియాపై అవగాహన, అనేది చాలా అవసరమని అన్నారు. లక్షణాలు అధికంగా ఉన్నవారికి అధునాతన చికిత్సలు, ఔషధాలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. తొలుత ప్రఖ్యాత మానసిక వైద్యులు డాక్టర్‌ ఎ. శంకరరావు చిత్రపటానికి నివాళులర్పించారు. మానస స్కిజోఫ్రెనియా ఫౌండేషన్‌, డాక్టర్‌ ఆమంచర్ల శంకరరావు మెమోరియల్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ ఐవీఎల్‌ నరసింహారావు, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ సుబ్బారాయుడు, డాక్టర్‌ ఎన్‌వీ రమణారావు, డాక్టర్‌ ఐ శరత్‌చంద్ర, డాక్టర్‌ శ్రీ రమ్య, డాక్టర్‌ ఇండ్ల రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొని డాక్టర్‌ జీ ప్రసాదరావును సత్కరించారు.


ఇవి కూడా చదవండి

ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు

Read Latest AP News And Telugu News

Updated Date - May 31 , 2025 | 04:58 AM