Share News

CPI : భవన సంక్షేమ బోర్డును పునరుద్ధరించండి

ABN , Publish Date - Jan 04 , 2025 | 06:49 AM

రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు.

CPI : భవన సంక్షేమ బోర్డును పునరుద్ధరించండి

అమరావతి, జనవరి 3(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు శుక్రవారం లేఖ రాశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బోర్డు నిధులను జీవో 17 ద్వారా దారిమళ్లించి బోర్డును నిర్వీర్యం చేశారని తెలిపారు. రాష్ట్రంలోని 46వేల పెండింగ్‌ క్లెయిములకు నిధులు మంజూరు చేయాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

Updated Date - Jan 04 , 2025 | 06:49 AM