CPI : భవన సంక్షేమ బోర్డును పునరుద్ధరించండి
ABN , Publish Date - Jan 04 , 2025 | 06:49 AM
రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు.

అమరావతి, జనవరి 3(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు శుక్రవారం లేఖ రాశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బోర్డు నిధులను జీవో 17 ద్వారా దారిమళ్లించి బోర్డును నిర్వీర్యం చేశారని తెలిపారు. రాష్ట్రంలోని 46వేల పెండింగ్ క్లెయిములకు నిధులు మంజూరు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.