Delhi Visit: రేపు ఢిల్లీకి చంద్రబాబు
ABN , Publish Date - Mar 17 , 2025 | 03:55 AM
ఏప్రిల్ నెలాఖరులో అమరావతి పనుల పునఃప్రారంభానికి మోదీని ఆహ్వానిస్తారు.
అమరావతి పనుల పునఃప్రారంభానికి
ప్రధాని మోదీని ఆహ్వానించనున్న సీఎం
పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ
అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధానిని ఆహ్వానించడానికి..
అమరావతి, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఏప్రిల్ నెలాఖరులో అమరావతి పనుల పునఃప్రారంభానికి మోదీని ఆహ్వానిస్తారు. ఈ భేటీ సందర్భంగా రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులతోపాటు పలు ఇతర అంశాలపై ప్రధానితో చంద్రబాబు చర్చించనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు.