ఇక నిఘా నీడలో నగరం
ABN , Publish Date - Mar 08 , 2025 | 01:32 AM
తిరుపతిలో ఏమి జరిగినా తెలిసేలా అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు.
తిరుపతి, మార్చి7(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో ఏమి జరిగినా తెలిసేలా అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కోసం నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్న ప్రాంతాలను శుక్రవారం స్మార్ట్ సిటీ, నగరపాలక సంస్థ, పోలీసు అధికారులతో కలసి పరిశీలిం చారు.పలు మార్పులను అధికారులకు సూచిం చారు. మౌర్య మాట్లాడుతూ స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తద్వారా అసాంఘిక శక్తులను, పారిశుధ్య పనులను, ఆక్రమణలను, నేరాలను సులువుగా గుర్తించవ చ్చునని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెం డెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, ఈఈ.రవి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ పాల్గొన్నారు.