అమర జవాన్ కార్తీక్ కుటుంబానికి రూ.కోటి సాయానికి ప్రభుత్వ అంగీకారం
ABN , Publish Date - Jan 30 , 2025 | 01:56 AM
జమ్ము కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన బంగారుపాళ్యం మండలం ఎగువ రాగిమానుపెంట గ్రామానికి చెందిన కార్తీక్ యాదవ్ కుటుంబానికి రూ.కోటి ఆర్థికసాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు.

బంగారుపాళ్యం, జనవరి 29(ఆంధ్రజ్యోతి):జమ్ము కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన బంగారుపాళ్యం మండలం ఎగువ రాగిమానుపెంట గ్రామానికి చెందిన కార్తీక్ యాదవ్ కుటుంబానికి రూ.కోటి ఆర్థికసాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. బుధవారం మొగిలీశ్వరుడి దర్శనానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ.కోటితో పాటు ఐదెకరాల భూమి, ఇంటి స్థలానికి సంబంధించిన దస్ర్తాలను కార్తీక్ కర్మక్రియల రోజున అందజేయనున్నట్లు తెలిపారు.