గోల్డ్ మ్యాన్
ABN , Publish Date - Feb 26 , 2025 | 02:52 AM
హైదరాబాదుకు చెందిన సూర్య.. ఎనిమిది కిలోల బంగారు ఆభరణాలు ధరించి తిరుమలకు వచ్చారు.

8 కిలోల ఆభరణాలతో శ్రీవారిని దర్శించుకున్న భక్తుడు
హైదరాబాదుకు చెందిన సూర్య.. ఎనిమిది కిలోల బంగారు ఆభరణాలు ధరించి తిరుమలకు వచ్చారు. మంగళవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల ఆయన్ను చూసేందుకు పలువురు ఆసక్తి చూపారు. ఈ సందర్భంగా సూర్య మీడియాతో మాట్లాడుతూ.. తాను హైదరాబాద్లో ఎన్ఎ్సఎ్స ప్రజాసేవా ఫౌండేషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తల్లి బతికున్నప్పుడు బంగారు
ఆభరణాలు వేసుకోమని చెబుతుండేదన్నారు. ఆమె చనిపోయాక.. ఆమె కోరిక మేరకు తాను ఈ ఆభరణాలను ధరించినట్టు తెలిపారు. దేశంలో ఎక్కడాలేని నరసింహుడి ఆభరణం తన వద్ద ఉందన్నారు.
- తిరుమల, ఆంధ్రజ్యోతి