Share News

టెన్త్‌ విద్యార్థులకు ఉచిత ప్రయాణం

ABN , Publish Date - Mar 08 , 2025 | 01:51 AM

టెన్త్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 17 నుంచి నెలాఖరు వరకు పరీక్షలు జరగనున్నాయి.

టెన్త్‌ విద్యార్థులకు ఉచిత ప్రయాణం

పరీక్షలు జరిగే రోజుల్లో హాల్‌టికెట్‌ చూపి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు

వెదురుకుప్పం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): టెన్త్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 17 నుంచి నెలాఖరు వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏ విధమైన బస్సు పాసులు లేకపోయినా హాల్‌ టికెట్‌ చూపితే పల్లె వెలుగు, అలా్ట్ర పల్లె వెలుగు బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణాన్ని అనుమతించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పరీక్షలు జరిగే రోజుల్లో మాత్రమే ఉచిత ప్రయాణానికి బస్సుల్లో అనుమతిస్తారు.

Updated Date - Mar 08 , 2025 | 01:52 AM