Share News

జిల్లా ఇన్‌చార్జి మంత్రికి 21వ ర్యాంకు

ABN , Publish Date - Feb 07 , 2025 | 01:28 AM

జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు పనితీరుపరంగా 21వ ర్యాంకు వచ్చింది. గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ ర్యాంకులను ప్రకటించారు.

జిల్లా ఇన్‌చార్జి మంత్రికి 21వ ర్యాంకు

తిరుపతి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు పనితీరుపరంగా 21వ ర్యాంకు వచ్చింది. గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ ర్యాంకులను ప్రకటించారు. గతేడాది జూలై నుంచి డిసెంబరు దాకా ఆరు నెలల పాటు ఫైళ్ల పరిష్కారంలో మంత్రుల పనితీరు ఆధారంగా ర్యాంకులు నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. మొత్తం 24 మంది మంత్రులు ఉండగా.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి సత్యప్రసాద్‌కు 21వ ర్యాంకు వచ్చింది.

Updated Date - Feb 07 , 2025 | 01:28 AM