Share News

పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష

ABN , Publish Date - Feb 27 , 2025 | 12:48 AM

పోక్సో కేసులో ఓ నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల యువకుడు 12 ఏళ్ల బాలికపై 2019లో అత్యాచారం చేశాడు.

  పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష

చిత్తూరు లీగల్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): పోక్సో కేసులో ఓ నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పరిధిలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల యువకుడు 12 ఏళ్ల బాలికపై 2019లో అత్యాచారం చేశాడు. దీనిపై స్థానిక పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు మంగళవారం వాయిదాకు రాగా, పూర్వాపరాలు పరిశీలించాక నేరం రుజువుకావడంతో యువకుడికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.2000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శాంతి తీర్పు చెప్పారు. ఈ కేసును స్పెషల్‌ పీపీ మోహన కుమారి వాదించారు.

Updated Date - Feb 27 , 2025 | 12:49 AM