Chevireddy Bhaskar Reddy: లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డికి రిమాండ్
ABN , Publish Date - Jun 18 , 2025 | 09:25 PM
Chevireddy Bhaskar Reddy: మద్యం కుంభకోణం కేసులో వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు అయిన సంగతి తెలిసిందే. సిట్ కార్యాలయంలో మూడు గంటలకు పైగా అధికారులు ఆయనను విచారణ చేశారు.
మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడుకు కూడా జులై 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది. అంతకు ముందు సిట్ అధికారులు ఆయన్ని మూడు గంటల పాటు విచారించారు. అయితే, సిట్ అధికారులు విచారణ చేసే సమయంలో సమాధానాలు చెప్పకుండా చెవిరెడ్డి ఎదురు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చదువుకుని సంతకాలు చేయమని ఇచ్చిన డాక్యుమెంట్ లను చెవిరెడ్డి చించివేశారని సమాచారం.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులను ఏసీబీ కోర్టులో హాజరుపరచిన సిట్ అధికారులు దర్యాప్తు వీడియో ఫుటేజీని ఏసీబీ కోర్టులో సమర్పించారు. మద్యం కుంభకోణం కేసులో తాను విచారణకు సహకరిస్తానని చెప్పినా అరెస్టు చేశారని చెవిరెడ్డి న్యాయాధికారికి విన్నవించారు. విచారణ సమయంలో తాను చెప్పిన జవాబులు కాకుండా వారి సొంతానికి రాసుకున్నారని తెలిపారు.
ఇవి కూడా చదవండి
విమాన ప్రమాదం.. రూ.70 లక్షల బంగారం, డబ్బు దొరికింది..
పెళ్లి చేసుకుందామని లవర్ను గోవా తీసుకెళ్లాడు. కానీ అక్కడ..