IIIT Admissions: ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి కొనసాగిన సర్టిఫికెట్ల పరిశీలన
ABN , Publish Date - May 31 , 2025 | 04:48 AM
నూజివీడు ట్రిపుల్ఐటీలో ప్రత్యేక కేటగిరీల సర్టిఫికెట్ పరిశీలన మూడో రోజు కొనసాగింది. 919 మందికి కాల్ లెటర్లు పంపగా, 698 మంది హాజరయ్యారు.
నూజివీడు టౌన్, మే 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లలో ప్రత్యేక కేటగిరీల కింద ప్రవేశాలు పొందిన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా నూజివీడులోని క్యాంపస్లో మూడో రోజు నిర్వహించారు. మొత్తం 919 మంది విద్యార్థులకు కాల్ లెటర్లు పంపగా 698 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరయ్యారు. స్పోర్ట్స్ కోటా కింద 467 మందికి కాల్ లెటర్లు పంపగా 344 మంది, ఎన్సీసీ కోటాలో 452 మందికి కాల్ లెటర్లు పంపగా 354 మంది హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి
ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
ఫేస్బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు
Read Latest AP News And Telugu News