Share News

Jagan Arrogance: ప్రజలు బుద్ధి చెప్పినా జగన్‌కు అహంకారం తగ్గలేదు

ABN , Publish Date - May 31 , 2025 | 04:40 AM

వైసీపీ అవినీతి పాలనపై భాజపా నేత భానుప్రకాశ్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేస్తేనూ జగన్‌ అహంకారాన్ని విడిచిపెట్టలేదన్నారు.

Jagan Arrogance: ప్రజలు బుద్ధి చెప్పినా జగన్‌కు అహంకారం తగ్గలేదు

న్యూఢిల్లీ, మే 30(ఆంధ్రజ్యోతి): ‘జగన్‌ అవినీతి, అక్రమ పాలనను సహించలేక ప్రజలు 11 సీట్లిచ్చి బుద్ధిచెప్పినా ఆయనకు అహంకారం మాత్రం తగ్గలేదు’ అని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం, ఏపీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు. వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసాన్ని సరిదిద్దడానికి కూటమి ప్రభుత్వానికి ఏడాది పట్టింది. మద్యం, ఇసుక, మైనింగ్‌ అక్రమాలపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరుపుతుంది. దోషులుగా తేలితే చట్టపరిధిలో శిక్షిస్తాం’ అని భానుప్రకాశ్‌ అన్నారు.


ఇవి కూడా చదవండి

ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు

Read Latest AP News And Telugu News

Updated Date - May 31 , 2025 | 04:40 AM