Share News

AP Teacher Transfers: టీచర్ల బదిలీలకు నేడు షెడ్యూల్‌

ABN , Publish Date - May 15 , 2025 | 02:38 AM

ఉపాధ్యాయుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కొత్త చట్టం ప్రకారం మే 31ని కటాఫ్‌గా తీసుకొని, శుక్రవారంనుంచి బదిలీ ప్రక్రియ ప్రారంభం కానుంది.

AP Teacher Transfers: టీచర్ల బదిలీలకు నేడు షెడ్యూల్‌

కొత్త బడుల ఆధారంగా స్థానచలనం

హెచ్‌ఎంలకు 5, టీచర్లకు 8 ఏళ్లు దాటితే తప్పనిసరి

అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ బదిలీలకు ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. తాజాగా బడుల పునర్‌వ్యవస్థీకరణ, పోస్టుల హేతుబద్ధీకరణపై జీవోలు విడుదల కావడంతో గురువారం బదిలీలపై జీవో ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. గురువారం జీవో విడుదల చేస్తే శుక్రవారంనుంచే బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూలు విడుదల చేయనుంది. కొత్తగా రూపొందించిన టీచర్ల బదిలీల చట్టం ఆధారంగా బదిలీలు జరగనున్నాయి. ప్రస్తుత పాఠశాలలో ఐదు విద్యా సంవత్సరాలు పూర్తిచేసుకున్న ప్రధానోపాధ్యాయులు, ఎనిమిది విద్యా సంవత్సరాలు పూర్తిచేసుకున్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ అవుతారు. పాఠశాలలో రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న టీచర్లు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యా సంవత్సరాల లెక్కింపునకు మే 31ని కటాఫ్‌ తేదీగా నిర్ణయించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్

Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్

Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 15 , 2025 | 02:38 AM