Andhra Pradesh: ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి సవరణలు
ABN , Publish Date - Jun 27 , 2025 | 06:46 AM
ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని ప్రభుత్వం సవరించింది.
అమరావతి, జూన్ 26(ఆంధ్రజ్యోతి): ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని ప్రభుత్వం సవరించింది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ-4.0(2024-29)లో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, ఆకర్షణీయమైన ప్యాకేజీలను ప్రభుత్వం ప్రకటించింది. అయితే కేంద్రం మార్చిలో ఎంఎ్సఎంఈలను కొత్తగా వర్గీకరిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలోనూ ఆ మేరకు సవరణలు చేస్తూ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.