POOJA: ముగిసిన అఖండ భజన
ABN , Publish Date - Feb 28 , 2025 | 12:08 AM
మహాశివరాత్రి సందర్భంగా చేపట్టిన అఖండ భజన గురువారం ఉదయం 6 గంటలకు ముగిసింది. ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంతులో అఖండ భజనలో పాల్గొన్న భక్తులందరికి నారాయణసేవ అందించారు.
పుట్టపర్తి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి సందర్భంగా చేపట్టిన అఖండ భజన గురువారం ఉదయం 6 గంటలకు ముగిసింది. ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంతులో అఖండ భజనలో పాల్గొన్న భక్తులందరికి నారాయణసేవ అందించారు. శివరాత్రి సందర్భంగా బుధవారం రాత్రి 6 గంటలకు ప్రారంభమైన అఖండ భజన గురువారం ఉదయం 6 గంటలకు ముగిసింది. అతిరుద్ర మహాయజ్ఞం ముగిసిన అనంతరం శివరాత్రి వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.