Share News

Minister Janardhan Reddy: సంపద సృష్టించే కేంద్రంగా అమరావతి

ABN , Publish Date - Apr 30 , 2025 | 05:41 AM

అమరావతిని సంపద సృష్టించే కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి ప్రకటించారు. మే 2న అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోదీ హాజరయ్యే రోడ్‌షో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు

Minister Janardhan Reddy: సంపద సృష్టించే కేంద్రంగా  అమరావతి

  • మంత్రి జనార్దన్‌రెడ్డి

గుంటూరు కార్పొరేషన్‌, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): సంపద సృష్టించే కేంద్రంగా అమరావతిని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నారని మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి అన్నారు. మంగళవారం గుంటూరు నగరపాలక సంస్థలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిని నిర్వీర్యం చేసిన ఘనత జగన్‌దేనని విమర్శించారు. మే 2న రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి ప్రధానమంత్రి మోదీ హాజరవుతున్నారని, ఈసంద ర్భం గా జరిగే రోడ్‌ షోను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Updated Date - Apr 30 , 2025 | 05:41 AM