ఆర్ఆర్ఆర్‌పై రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ABN, Publish Date - Jan 17 , 2024 | 12:03 PM

హైదరాబాద్: రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణను మూడు నెలల్లో పూర్తి చేయాలని నిర్మాణపనులకు టెండర్లు పిలవాలని సీఎం స్పష్టం చేశారు.

హైదరాబాద్: రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణను మూడు నెలల్లో పూర్తి చేయాలని నిర్మాణపనులకు టెండర్లు పిలవాలని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకువచ్చే లక్ష్యంతో దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచే అధికారులకు ఆదేశాలిచ్చారు. ఔటర్ రింగ్ రోడ్డు అవతల నిర్మించ తలపెట్టిన ఆర్ఆర్ఆర్ భూసేకరణ ప్రక్రియ కొంతకాలంగా పెండింగ్‌లో పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Jan 17 , 2024 | 12:15 PM