జగన్ ఓటమే మన లక్ష్యం: పవన్

ABN, Publish Date - Feb 21 , 2024 | 10:27 AM

అమరావతి: పార్టీలో టిక్కెట్ల ఆశావహులు అధికంగా ఉన్నారని.. కానీ అందరికీ సర్దుబాటు చేయడం కష్టమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇక పొత్తులో ఉన్నప్పుడు అన్నీ సీట్లు ఇవ్వడం సాధ్యంకాదన్నారు.

అమరావతి: పార్టీలో టిక్కెట్ల ఆశావహులు అధికంగా ఉన్నారని.. కానీ అందరికీ సర్దుబాటు చేయడం కష్టమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇక పొత్తులో ఉన్నప్పుడు అన్నీ సీట్లు ఇవ్వడం సాధ్యంకాదన్నారు. టీడీపీ, జనసేన ఓట్లు పరస్పరం బదిలీ కావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ‘‘ఎట్టి పరిస్థితిలోనూ జగన్ ఓడాలి.. జనసేన, తెలుగుదేశం కలిసి అధికారంలోకి రాబోతున్నాయి.. బీజేపీ కూడా కలిసి వస్తుంది.. అందరూ ఐక్యంగా పనిచేయాలి.. ఓటు బదిలీ కావాలి.. ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలి.. 2019 ఎన్నికల్లో సీట్లు ఆశించినవారందరికీ స్వేచ్చగా టిక్కెట్లు కేటాయించగలిగాం.. ప్రస్తుత పరిస్థితులు వేరు.. అర్థం చేసుకోండి’’ అంటూ పవన్ కల్యాణ్ పార్టీ నేతలకు చెప్పారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 21 , 2024 | 10:27 AM