ఆ కూల్చివేత తరువాత తొలిసారి సీఎంతో నాగార్జున

ABN, Publish Date - Dec 26 , 2024 | 12:19 PM

Telangana: కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సినీ పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాల ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి హీరో అక్కినేని నాగార్జున కూడా పాల్గొన్నారు.

హైదరాబాద్, డిసెంబర్ 26: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) సినీ ప్రముఖుల భేటీ కొనసాగుతోంది. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి సినీ నిర్మాతలు, దర్శకులు, పలువురు హీరోలు హాజరయ్యారు. సినీ పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి హీరో అక్కినేని నాగార్జున కూడా పాల్గొన్నారు. అయితే అక్రమ కట్టడం అంటూ నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చి వేసిన విషయం తెలిసిందే. ఇది అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది. అయితే ఎన్‌ కన్వెన్షన్ కూల్చివేత తరువాత తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని హీరో నాగార్జున కలవడం ఆసక్తికరంగా మారింది.



ఇవి కూడా చదవండి...

నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే

నేడు కర్ణాటకకు రేవంత్.. విషయం ఇదే..

Read Latest Telangana News And Telugu News

Updated at - Dec 26 , 2024 | 12:27 PM