రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త..
ABN, Publish Date - Apr 16 , 2024 | 11:49 AM
మహబూబ్నగర్: ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్రంలోని 68 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయలేకపోయామని, ఆగస్టు 15వ తేదీలోపు వారందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మహబూబ్నగర్: ఎన్నికల కోడ్ కారణంగా రాష్ట్రంలోని 68 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయలేకపోయామని, ఆగస్టు 15వ తేదీలోపు వారందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం వచ్చే పంట నుంచి రూ.500 బోనస్ ఇచ్చి పండిన చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని ప్రకటించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జన జాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్పై నిప్పులు చెరిగారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Apr 16 , 2024 | 11:49 AM