తుపాకీతో టీడీపీ శ్రేణులకు సీఐ బెదిరింపు..

ABN, Publish Date - Mar 26 , 2024 | 12:34 PM

అమరావతి: ఏపీలో అధికారపార్టీ నేతలకు అధికాలు వత్తాసు పలుకుతున్నారు. ఎన్నికల కమిషన్ ఎన్ని రూల్స్ పెట్టినా, ఎన్ని సార్లు చెప్పినాసరే కొందరు అధికారుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు.

అమరావతి: ఏపీలో అధికారపార్టీ నేతలకు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. ఎన్నికల కమిషన్ ఎన్ని రూల్స్ పెట్టినా, ఎన్ని సార్లు చెప్పినాసరే కొందరు అధికారుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు. అధికార వైసీపీ నేతలు ఏం చేసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు... ప్రతిపక్ష నేతలు ఏం చేసినాసరే తప్పంటున్నారు. పల్నాడు జిల్లా, కారంపూడిలో సీఐ మల్లయ్య టార్గెట్ టీడీపీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. టీ తాగుతున్న టీడీపీ శ్రేణులను సీఐ తుపాకీతో బెదిరించారు. తుపాకీ ఎందుకు తీశారని ప్రశ్నించిన టీడీపీ శ్రేణులపై మల్లయ్య ఎదురుదాడి చేశారు.

Updated at - Mar 26 , 2024 | 01:52 PM